Nizam Students | కాంగ్రెస్ సర్కార్ హయాంలో స్కూళ్లు, వాటిలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టుగా చూపించే దృశ్యాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. రేవంత్ విద్యాశాఖ పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందో చెప్పేందుకు తాజా ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు.
నిజాం కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం పోవాలంటే పోరాటాలు చేయాల్సిందే.. ఉద్యమాల గడ్డరా.. నిజాం కాలేజీ అడ్డరా.. అంటూ నినాదాలు చేశారు. తాము వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
నిజాం కాలేజీలో విద్యార్థుల నిరసన
విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా హాస్టల్స్ అలాట్ చేయడంలేదని ఆందోళనకు దిగిన విద్యార్థులు
వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని డిమాండ్ pic.twitter.com/rQZoDZjFxd
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు