మహబూబ్నగర్: జిల్లాలోని మన్యంకొండ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిరుత చనిపోయింది. మహబూబ్నగర్-రాయచూరు (ఎన్ హెచ్ 167) రహదారిపై మన్యంకొండ సమీపంలోని కాకతీయ స్కూల్ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో చిరుతపులి అక్కడికక్కడే మృతిచెందింది. వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దేవరకద్ర పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతపులికి పంచనామ నిర్వహించారు. మన్యంకొండ గుట్టలో నుంచి ఆహారం కోసం రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.