జడ్చర్ల, డిసెంబర్ 2 : జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీ ల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. నవంబర్ 30వ తేదీన జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఈనెల 3వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో జడ్చర్ల మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చర్చలు జరుపుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మంది ఓటర్లు ఉండగా అందులో 1,79,652 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదుగురు ఇతరులు ఉండగా అందులో నలుగురు ఓట్లు వేశారు. దీంతో నియోజకవర్గంలో 81.56శాతం పోలింగ్ నమోదైంది. ఏ పార్టీకి ఆపార్టీలు ఎవరికీ వారు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించడంతో ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గుచూపారనేది అంచనాలకు అందడంలేదు. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో అందరికంటే ముందువరుసలో ఉన్నా రు. జడ్చర్ల నియోజకవర్గంలో మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. దీంతో నియోజకవర్గ ప్రజలు లక్ష్మారెడ్డికి పట్టం కట్టనున్నట్లు ఎన్నికల సరళిని చూస్తే తెలిసిపోతుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ బీదప్రజల కోసం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంతో అన్ని వర్గాల ప్రజలు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, రైతులు, చేతివృత్తులవారు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారనేది ఈ ఎన్నికలలో తెలిసిపోయింది. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్దిచేకూరడంతో అందరు బీఆర్ఎస్కే మద్దతు తెలిపారని, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. దీంతో వరుసగా ముచ్చటగా మూడోసారి గెలుపొందుతారని జడ్చర్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన నాయకుడికి ప్రజలు అండగా నిలుస్తారనేది ఈ ఎన్నికల్లో తేలిపోయింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జడ్చర్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవడం జరిగింది. దీంతో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని నాయకులు, కార్యకర్తలు చర్చించుకుటుంన్నారు. జడ్చర్లలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేసినా ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొన్నది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు వారి అనుచరులు ఎవరికీ వారే అంచనాలు వేసుకుంటూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపుతో వారి భవిష్యత్తు తేలిపోనుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అందరిలోనూ ఉత్కంఠ కొనసాగనుంది. అప్పటి వరకు అగాల్సిందే.
14 టేబుళ్లు, 20 రౌండ్లు
జడ్చర్ల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల కో సం మొత్తం 14టేబుళ్లు, 20 రౌండ్లలో ఓట్ల లెక్కిం పు ఉండనుంది. నియోజకవర్గంలో మొత్తం 274 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఒక్కో సారి 14 బూత్లకు సంబంధించిన ఈవీఎంలను తీసుకొని ఓట్లను లెక్కించడం జరుగుతుంది. దానికిగానూ 20 రౌండ్లలో ఓట్లను లెక్కించడం జరుగుతుంది.