KTR | వెల్దండ, ఏప్రిల్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్హాల్లో శనివారం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నా రు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వ ల బాలరాజు, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో స మావేశమై మాట్లాడుతూ..
మేధావి, విద్యావంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. 4నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. 4నెలలుగా పాడి రైతులకు బిల్లులు లేవని, ఉచిత కరెంట్ ఊసేలేదన్నారు. మిషన్ భగీరథకు జ్వరం వచ్చిందని, హైదరాబాద్లో రెండ్రోజులకోసారి నీళ్లు వస్తున్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.