గద్వాల/గద్వాల రూరల్, డిసెంబర్ 28 : లబ్ధిదారులు దరఖాస్తులను నింపిన తరువాత సంబంధిత అధికారుల కు అందజేసి.. వారు ఇచ్చిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూ చించారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సంక్షేమ పథకాలను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గద్వాల మండలం బీరెల్లి, లత్తీపురం, జమ్మిచేడు, వెంకంపేట గ్రామాల్లో గురువారం జెడ్పీ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్తో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ ఒక్కరికీ అందజేయాలని అధికారులకు సూచించారు.
దరఖాస్తు సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే కౌంటర్ వద్ద అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రతి పేద వాడికి సంక్షేమ పథకాలు అందాలని, అర్హులందరికీ పథకాలను అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ మాట్లాడుతూ అందుబాటులో లేని వారు 6వ తేదీ వరకు ఆయా వార్డుల్లో ఉన్న అధికారులకు దరఖాస్తులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కాం తమ్మ, మున్సిపల్ కమిషనర్ నరసింహ, తాసీల్దార్ నరేందర్, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ ప్రతాప్గౌడ్, ఎంపీటీసీ రాధమ్మ, సర్పంచ్ జయమ్మ పాల్గొన్నారు.