నాగర్కర్నూల్, ఫిబ్రవరి 2 : ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలకపల్లి, నాగర్కర్నూల్ రూరల్కు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని, వారి వల్లే ఇన్నేండ్లుగా పార్టీ బలం గా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటమికి గల కారణాలు ఎన్నో ఉన్నాయని కేవలం 5వేల ఓట్ల తో దాదాపు 20మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం కేవలం 1.5 శాతం నుంచి 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్కర్నూల్, దేవరకద్ర మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బాగా మాట్లాడారని, సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్ట లేకపోయామన్నారు. ప్రతిపక్షం వారు అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదన్నారు.
అందువల్లే ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండేది కొంతకాలమేనని, భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, మళ్లీ మన సత్తా ఏంటో చూపించాలన్నారు. బూత్కి ఐదుగురి కథానాయకులు కావాలని, పంచ పాండవుల లాగా పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టంగా తయారు చేస్తామన్నారు. తానే స్వయంగా గ్రామాలకు వస్తానని, సమావేశాలు ఏర్పా టు చేసి గ్రామ పార్టీ కమిటీలను పునర్ నిర్మాణం చేస్తామన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రతిపక్షాలు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమ లు చేసేవిధంగా ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నేతలు బైకని శ్రీనివాస్యాదవ్, నాగం శశిధర్రెడ్డి, హన్మంతురావు, నరేందర్రెడ్డి, బంగారయ్య పాల్గొన్నారు.