మహబూబ్నగర్, నవంబర్ 9 : పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ రంగాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బుధవారం లండన్లో జరుగుతున్న వర ల్డ్ ట్రావెల్ మార్ట్లో టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడంతో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రపంచంలోనే టూరిజం విలేజ్ గా పోచంపల్లి ఎన్నిక కావడం చారిత్రాత్మకమన్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక వైభవాన్ని లండన్ వేడుకగా ప్రపంచ దేశ పర్యాటకుల కు, ట్రావెల్ ఏజెంట్లకు తెలిసేలా రాష్ట్ర పర్యాటక ప్రదేశాల సమాచారం, ట్రావెల్లర్స్కి, టూర్ ఆపరేటర్స్కు ఉచితంగా అందించామని తెలిపారు. తెలంగాణ టూరిజం రోడ్షోను ఘనంగా నిర్వహించామన్నారు. పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా ఈ ట్రావెల్ మార్ట్లో ఏజెంట్లకు అందించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ శ్రీ నివాస్గుప్తా, ఎండీ మనోహర్, అధికారులు మహే శ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ కమలాకర్, అధ్యక్షుడు శ్రావణ్గౌడ్, తెలంగాణ జాగృతి ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ తెలంగాణ, టూరిజం శాఖాధికారులు, ఇండియా టూరిజం అధికారులున్నారు.