కోస్గి, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం చూట్టారు. మంగళవారం సర్జఖాన్పేట్, తోగాపూర్, నాచారం, చంద్రవంచ, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచా రం నిర్వహించగా ప్రజలు భారీగా హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఐదు నెలలు గడిచినా హామీల అమలులో విఫలమైందన్నారు. తొమ్మిదేండ్లు రాష్ర్టాన్ని కేసీఆర్ అద్భుతంగా పాలించారని.. రేవంత్రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపించడం చేతకావడంలేదని ఎద్దేవా చేశారు. రైతుబంధు అడిగితే ఓ కాంగ్రెస్ మంత్రి చెప్పుతో కొడ్తతమని అంటున్నడు. రూ.2లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామని రేవంత్రెడ్డి మరో మోసపూరిత మాట చెబుతున్నాడన్నారు. కల్యాణలక్ష్మి లేదు.. తులం బంగారం లేదు.. రూ.4వేల పింఛన్ లేదు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్ లేదని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పా లనే శ్రీరామరక్ష అని అన్నారు. మోదీ గత ఎన్నికల్లో 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు జమచేస్తామని, నల్లా ధన్నా న్ని బయటకు తీస్తామని చెప్పి.. మాటతప్పారన్నారు. బీజేపీ పార్టీ దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్నదని, అక్షింతలు పంపిస్తే ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు.
అన్నం పెట్టే నాయకుడు కావాలో.. అక్షింతలు పంపే నాయకుడు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మళ్లీ గెలిచినట్లేనన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎ మ్మెల్యే పట్నం మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి సీఎం అ య్యాక కొడంగల్కు చేసిందేమీలేదన్నారు. దుద్యాల్ మండం లగచర్లలో ఫార్మా కంపెనీలను తీసుకొస్తే.. కలుషితాలతో ప్రజలు నష్టపోతారనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. మనకు హాని చేసే కంపెనీలను కొడంగల్కు రానివ్వమని, ధర్నాలు చేసై నా అడ్డుకుంటామన్నారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్ల పంపిణీని పూర్తిగా బంద్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కేసీఆర్కు మించిన పాలన చేస్తుందనుకుంటే.. కిరణ్కుమార్రెడ్డి పాలనకంటే ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎ న్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, వైస్ఎంపీపీ సాయిలు, కౌన్సిలర్లు జనార్దన్రెడ్డి, బందె ప్ప, కోస్గి బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు వెంకట్ నర్సింహులు, నాయకులు రాజు, నరేందర్రెడ్డి, సుభాష్, నిరంజన్రెడ్డి, సాయప్ప, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.