ధరూరు, ఫిబ్రవరి 7 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చింది. పేదలందరికీ విద్య అందించాలన్న సదుద్ధేశంతో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అంచింది వారి విద్యాభివృద్ధికి కృషి చేసింది. అటువంటి గురుకులాలు నేడు సమస్యల వలయంలో చిక్కుకొన్నాయి. కొన్ని రోజులుగా నాసిరకమైన భోజనం పెడుతుండడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ హెడ్క్వార్టర్స్లో నిర్వహిస్తున్న కేటీదొడ్డి మండలానికి చెందిన మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరికి అందించే ఆహారంలో ఏ మాత్రం మెనూ పాటించకుండా నాసిరకమైన భోజనం అందిస్తుండడంతో విద్యార్థులంతా కడుపు మాడ్చుకొని చదవలేమని ఈ భోజనాలు మాకొద్దు బాబోయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా విద్యార్థులందరూ కలిసి మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేస్తూ గద్వాలలోని కలెక్టరేట్ వెళ్లేందుకు కాలినడకన ర్యాలీగా బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి కలెక్టరేట్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎస్సై వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్వేతా ప్రియదర్శిని, ఎంఈవో సురేశ్ అక్కడికి చేరుకొని బూరెడ్డిపల్లి పాఠశాలలో విద్యార్థులను కూర్చొబెట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొది రోజులుగా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని, ప్రిన్సిపాల్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక నుంచి మేమే చూసుకుంటామని, మెరుగైన భోజన వసతి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తిరిగి గురుకుల పాఠశాలకు చేరుకున్నారు.
మాకు ఎప్పుడూ కడుపునిండా భోజనం పెట్టడం లేదు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని అడుగుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. ఈ రోజు మ ధ్యాహ్నం చికెన్ పెట్టాలి, అయినా పెట్టలేదు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుపోగా ఆయన సర్దిచెప్పడం తప్ప ఒక్క రోజు కూడా మా వైపు నుంచి ఆలోచించలేదు. ఈ విషయం మేము మూడు నెలల ముందే కలెక్టర్కు చెప్పాలనుకు న్నాం. అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నందున సా ధ్యం కాలేదు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పరీక్షలు ఉ న్నాయి. ఇక కడుపులు మాడ్చుకొని చదువడం కష్టంగా మారింది. దీంతో ఈ విషయం చెప్పడానికే మేం కలెక్టర్ వద్దకు బయలుదేరాం.
మాకు మెనూ ప్ర కారం టిఫిన్, భోజనా లు పెట్టాలి. కొద్ది రోజుల నుంచి ఏ మాత్రం అమ లు చేయడం లేదు. ఉద యం టిఫిన్కు పెట్టే ఇడ్లీ లు రాళ్లలా ఉంటున్నా యి. పాఠశాలలు ప్రా రంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు సార్లు మాత్రమే మటన్ వండిపెట్టారు. చికెన్ కూడా సక్రమంగా పెట్టడం లేదు. వారికి బుద్ధిపుట్టినప్పుడే పెడుతున్నారు లేదంటే లేదు. అన్నం కూడా సరిగా ఉండడం లేదు. మాకు కడుపునిండా భోజనం పెట్టాలని పలుమార్లు ప్రిన్సిపాల్ను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతోనే మా సమస్యలు కలెక్టర్తోనైనా చెప్పుకుందామని గద్వాలకు బయలుదేరాం.
ప్రస్తుతం మార్కెట్ రేట్లు, ప్రభుత్వం ఇచ్చే రేట్లకు ఏ మాత్రం సరిపోవడం లేదు. మే ము మాత్రం ఏం చేయాలి. సాధ్యమైనంత వరకు ప్ర యత్నం చేస్తు న్నాం. విద్యార్థులు కూడా నా దృష్టికి తీసుకువచ్చారు. నా వంతుగా నాణ్యమైన భోజనం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. సరైన సమయంలో బిల్లులు రాక టెండర్ దారులకు బిల్లులు చెల్లించలేక పోతున్నాం. అందువ ల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విద్యార్థులు ఎప్పుడూ భోజనాలకు సంబంధించి సమస్య గురించి చెప్పలేదు. అ యినా ప్రిన్సిపాల్ ని బంధనల ప్రకారం వి ద్యార్థులకు భోజనం అందించలేకపోతే లె టర్ రాసి తొలగిపోవా లి. ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తప్పు. విద్యార్థులు నాతో మాట్లాడిన ప్రకారం పండ్లు, మ టన్, చికెన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, బిల్లులు మాత్రం అన్నీ ఇచ్చినట్లు రాసుకుంటున్నారు. ప్ర స్తుతం విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారని కలెక్టర్ దృష్టికి వెళ్లింది, ఆయన ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.