వనపర్తి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రెండో వి డుత కంటివెలుగు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, వనపర్తి జిల్లాలో ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కంటివెలుగును సక్సెస్ చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మారుతున్న జీవనశైలి. ఆహారపు అలవా ట్లు, వాతావరణ మార్పులతో ప్రతి ఒక్కరికీ కంటి సమస్య సర్వసాధారణమైంది. ఇలాగే కొనసాగితే ప్రమాదమని గు ర్తించిన సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కిందట కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందజేశారు. వ్యాధి తీవ్రత ఉన్నవారికి శస్త్ర చికిత్సలు చేశారు.
ఈ క్రమంలో రెండో విడుతను చేపట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దాదాపు నాలుగున్నర ల క్షల మందికి పరీక్షలు జరిపేలా ప్రణాళికలు రూపొందించా రు. ప్రోగ్రాం ఆఫీసర్లతో సమావేశమై ప్రణాళికను రూపొందిస్తున్నారు. వయోబేధం లేకుండా పరీక్షలు చేయనున్నారు. గతంలో చికిత్స చేయించుకున్న వారు, వృద్ధుల వివరాల ను జిల్లా వైద్యారోగ్యశాఖ సేకరించింది. రెండో విడుతలో కంటిపరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 28 బృందాలను ఏర్పాటుచేశారు. ఒక్కో బృందంలో డాక్టర్, కంటి వైద్య నిపుణుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశకార్యకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉండనున్నారు. ఒక్కో బృం దం కనీసం 15వేల మందికి పరీక్షలు చేయనున్నది. నిత్యం గ్రామాల్లో 300, పట్టణాల్లో 400 మందికి పరీక్షలు చేసి అద్దాలు అందించాలి. జిల్లా వ్యా ప్తంగా సర్వే చేసి డేటా తయారుచేశారు. జిల్లా లో 6,47,098 మంది ఉండగా.. కంటి స మస్యతో బాధపడుతున్న వారు 40 శా తం వరకు ఉంటారని అధికారుల అంచనా. కాగా, మొదటి విడుత లో 3,17,173 మందికి పరీక్ష లు చేయగా, 78,313 మం దికి అద్దాలు పంపిణీ చే శారు. 9 వేల మం దికి శస్త్ర చికిత్స చేశారు.
దిశానిర్దేశం చేశాం..
జిల్లాలో కంటివెలుగు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. వై ద్యాధికారులతో ప లుమార్లు సమావేశమై దిశానిర్దేశం చే శాం. ఎంతమంది పరీక్షలకు వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నాలుగున్నర లక్షల మంది టెస్టుల కోసం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాకు వచ్చాం. అందరికీ పరీక్షలు చేసి సమస్య ఉన్న వారికి కళ్లద్దాలు లేదా శస్త్రచికిత్స చేసేలా కార్యాచరణ రూపొందించాం. బుధవారం నిర్వహించనున్న అవగాహన సదస్సుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా హాజరుకానున్నారు.
– డాక్టర్ రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి