నర్వ, డిసెంబర్ 23: నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తుంటే ప్రతిపక్షాలు నిరాధారమైన విమర్శలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నచ్చని ఈ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో తన ఉనికిని కోల్పోయిన ఒక పార్టీ నాయకుడు మళ్లీ ఈ ప్రాంతంలో తన విషబీజాలను నాటేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, ప్రజలు అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మండలంలో మిగిలిన అభివృద్ధి పనులను సకా లంలో పూర్తి చేయించి నర్వ మండలాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, వైస్ఎంపీపీ వీణావతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, నాయకులు లక్ష్మణ్, మండ్ల చిన్నయ్య, దండు అయ్యప్ప, ఎంపీడీవో, తాసిల్దార్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడపడుచులకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దన్న గా సీఎం కేసీఆర్ నిలిచారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశా రు. మండలంలో మొత్తం 58మంది లభ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్య క్రమంలో ఎంపీపీ శ్రీకళ, మండల రైతు సమన్వయ సమితి అద్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి, సర్పంచ్ గోవర్ధన్, వైస్ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు గోపాల్, సుజాత, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, నాయకులు రాజవర్దన్రెడ్డి, తిరుపతయ్య, కృష్ణారెడ్డి, చంద్రశేఖ ర్, వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, తాసిల్దార్ రాంకోటి, ఆర్ఐలు శ్రీశైలం, సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.