కల్వకుర్తి రూరల్, మార్చి 29 : పార్టీలకతీతంగా అ ర్హులైన ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని వేపూర్ గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు, కల్వకుర్తి ఏఎంసీ చైర్మన్ విజయ్గౌడ్ అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి ముఖ్య అతిథులుగా హా జరయ్యారు. గ్రామానికి చేరుకున్న ప్రజాప్రతినిధులుకు సర్పంచ్ మాధవి, వైస్ ఎంపీపీ గోవర్ధన్, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. వేపూర్ బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనే య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని, నేడు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో ప ట్టణాలకు దీటుగా నిలుస్తున్నాయన్నారు.
75 ఏండ్లల్లో ఏ పాలకులు చేయని అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లల్లో చేసి చూపించారన్నారు. దాదాపుగా 450 పథకాలను ప్రవేశపెట్టి అర్హులందరికీ అందజేస్తూ.. దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా నిలిపారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇండస్ట్రీయల్ పాలసీ, విధానాలతో ప్రపంచంలోని ఆయా దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. దీం తో పారిశ్రామికంగా అ భివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో జ రుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు త మ ఉనికిని కోల్పోతాయనే భయం తో అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని, వారి మాటలను నమ్మొద్దన్నా రు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా సమష్టిగా ఉంటూ రాబోయే ఎ న్నిక్లలో హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, ఎంపీపీ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, కో ఆప్షన్ సభ్యుడు రుక్నోద్దీ న్, వెల్దండ జెడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, రైతుబంధు స మితి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.