పాలమూరు, సెప్టెంబర్ 19 : జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర్ శుభవార్త అందించారని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు, రామ్నగర్లోని మండపాల్లో కొలువైన వినాయక విగ్రహాలకు మంత్రి పూజలు నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.50లక్షలతో మహబూబ్నగర్లో గణేశ్ భవన్ను నిర్మించామన్నారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు ద్వారా రెండు పెద్ద కాలువలు.. ఒకటి ధర్మాపూర్ వద్ద, మరొకటి పాలకొండ వద్ద హైవే మీదుగా వెళ్తాయన్నారు. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, ఐలాండ్, శిల్పారామం, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు మొదలైనవి మహబూబ్నగర్కు మణిహారంగా మారాయన్నారు. మన్యంకొండ వద్ద రోప్వే పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు శరత్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గణేశ్ ఉత్సవకమిటీ అధ్యక్షుడు వీహెచ్సీ చంద్రయ్య, గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బాలయ్య, వీహెచ్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్, మాల్యాద్రిరెడ్డి, నవకాంత్, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, భక్తులు ఉన్నారు.
మహబూబ్నగర్ టౌన్/బాలానగర్, సెప్టెంబర్ 19 : క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధా న్యం కల్పిస్తున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో విజేతగా నిలిచిన చిన్నరేవల్లి జట్టు సోమవారం హైదరాబాద్లో మంత్రిని ఆయన క్వార్టర్స్లో కలిసింది. ఈ సందర్భంగా సభ్యులను మంత్రి శాలువాలతో సన్మానించి రూ.50వేలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నరేవల్లిలో రెండు వాలీబాల్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్లో త్వరలోనే జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో కోయంబత్తూరులో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రిని క్రీడాకారులు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. వాలీబాల్ టోర్నమెంట్ ఆడుతున్న క్రీడాకారులకు సోమవారం ఎంపీటీసీ అభిమన్యురెడ్డి రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 19 : మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదురుగా అర్బన్ కాన్సెప్ట్, పాలకొండ బైపాస్లో హ్యాండ్ ఫౌంటెన్, పిస్తా హౌస్ వద్ద తీర్చిదిద్దిన పలు ఆకృతులు, బైపాస్పై సెంట్రల్ మీడియన్, గ్రీనరీ, లైటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ సెంట్రల్ లైటింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. పట్టణం లో 18 జంక్షన్లను రూ.3కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అనంతరం అప్పన్నపల్లి రెండో ైప్లెఓవర్పై లైటింగ్ సిస్టమ్ను మున్సిపల్ చైర్మన్ నర్సింహులుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు ఉన్నారు.
మహబూబ్నగర్లోని ప్రధాన స్టేడియంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలో త్వరలో జాతీయస్థాయి క్రీడలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. స్టేడియాన్ని అంతర్జాతీయ సౌలత్లతో నిర్మిస్తున్నామని, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 400 మీటర్ల 8లైన్ల సింథటిక్ ట్రాక్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, క్రీడాశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
హన్వాడ, సెప్టెంబర్ 19 : మండలంలోని పెద్దదర్పల్లి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుకు ఎంపికైంది. ఈక్రమంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను మంత్రి సత్కరించి రూ.10లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. శుభకార్యాల కోసం గ్రామంలో కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేస్తాన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచ్ వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.