జడ్చర్ల, డిసెంబర్ 29 : దేశాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, కిష్టారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు. ముందుగా ఖానాపూర్లో మహిళాసంఘం భవనం, క్రీడాప్రాంగణం, ఎస్సీ, బీసీ కమ్యూనిటీహాళ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన ఐదుగురు దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. అలాగే కిష్టారంలో సీసీరోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనే జీ, క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్ధాలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉం డి ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పంచుతుందన్నారు. కొందరి కోసమే ఆ పార్టీ పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పా టు చేశారని తెలిపారు.
దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచులు అరుణాసత్యనారాయణ, నర్సింహు లు, నాయకులు గోపాల్రెడ్డి, సత్యనారాయ ణ, నాగిరెడ్డి, శంకర్నాయక్, గోపాల్, రా మ్మోహన్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.