జడ్చర్ల/రాజాపూర్, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులతో ఎమ్మెల్యే అ ధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మండలం నుంచి దాదాపుగా మూడు వేల మం ది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఏదీ కొనలేని పరిస్థితి వచ్చిందన్నారు. 76 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ల హయాంలో జరగని అభివృద్ధిని.. సీఎం కేసీఆర్ కేవ లం ఎనిమిదేండ్లలోనే చేసి చూపించారన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ ఇప్పటివరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. ఇక్కడి పథకాలు దేశంలో ఎక్కడా అమలుకావడం లేదన్నారు. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుల పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్గా మా ర్చి వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నా రు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటికే నీటిని అందిస్తున్నామన్నారు. పే దింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కాకూదనే ఉద్దేశంతో క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి పై గ్రామగ్రామానా చర్చ జరగాలన్నారు.
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మాయమాటలతో పబ్బం గడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉందని.. ప్రతిపక్షమే లేదన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేసీఆర్ను చూస్తే బీజేపీకి, మోదీకి గుండెల్లో వణుకు పుడుతుందన్నారు. అనంత రం పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు. కళాకారుల ఆటపాటలు, గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహిళలతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్టెప్పులేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భో జనం చేశారు. అభిమన్యు యువసేన ఆధ్వర్యంలో గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. మండల గొల్లకురుమలు ఎమ్మెల్యే కు గొంగడి, గొర్రెపిల్లను బహూకరించారు.
24 గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో ఎమ్మెల్యే ఫొటోలు దిగారు. 13 రకాల వంటకాలు, మజ్జిగ, ఐస్క్రీమ్లను వడ్డించారు. కార్యక్రమం లో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్ర భాకర్రెడ్డి, సంగీత, నాటక అకాడమి మాజీ చైర్మన్ బా ద్మిశివకుమార్, రాజాపూర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షు డు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ నర్సింహులు, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్ఖా న్, కౌన్సిలర్ ప్రశాంత్రెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిని, ఎంపీపీ సుశీల, జె డ్పీటీసీ మోహన్నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, నాయకులు నరహరి, సత్యయ్య, అల్తాఫ్, ఆనంద్గౌడ్, వెంకటయ్యగౌడ్, రమేశ్నాయక్, హతీరాం, యా దగిరి, శేఖర్గౌడ్, మహేశ్గౌడ్, మోహన్రెడ్డి, మల్లేశ్గౌ డ్, తిరుపతయ్య, శ్రీశైలం, కృష్ణయ్య, శ్రీనివాస్రెడ్డి, పు ల్లారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.