కేటీదొడ్డి, మే 24 : మండలంలోని చింతలకుంటలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన రైతు బ్యాగరి నాగప్ప పొలంలోని తాటిచెట్టుపై పిడుగుపడింది. ఆ సమయం లో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. విరిగిన కరెంట్ స్తంభం ధరూరు, మే 24 : మండలంలోని కోతులగిద్దలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం విరిగిపడింది.