గద్వాల అర్బన్, ఏప్రిల్ 20 : తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంలో ని ర్మించిన డబుల్ బెడ్రూంలకు సంబంధించి ఇటీవల లక్కీడిప్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కోటాలో పట్టణంలోని 15వ వార్డుకు చెందిన శాలిమియాను ఎంపిక చేశారు. అయితే ఇంటి మంజూరుకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించేందుకు గురువారం కలెక్టరేట్ కార్యాలయానికి శాలిమియా వెళ్లాడు. అక్కడ అధికారులు అతడికి షాక్ ఇచ్చారు. జాబితాలో నీ పేరు లేదని చెప్పారు.
దీంతో కంటతడి పెట్టాడు. లక్కీడిప్లో తనకు ఇల్లు కేటాయించారని, తీరా ఇప్పుడు తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మనస్తాపంతో కార్యాలయం ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమై అతడికి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఒంటిపై నీళ్లు పోశారు. డబుల్బెడ్రూం కేటాయించిన తర్వాత అధికారులు తన పేరు లేదని చెప్పడం సరికాదన్నారు. న్యాయం చేయకుంటే కుటుంబ సభ్యులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అనంతరం అతడిని పోలీస్స్టేషన్కు తరలించారు.