నెట్వర్క్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 34,463 మంది విద్యార్థులకు గానూ 32,878 మంది హాజరుకాగా 1589 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు నిమిషం నిబంధనను అమలు చేయడంతో చాలా వరకు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఒకటి రెండు సెంటర్లలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు లేటుగా చేరుకోవడంతో వారిని అనుమతించలేదు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని పరీక్షా కేంద్రంలో స్పృహ తప్పి పడిపోగా 108లో దవాఖానకు తరలించి వైద్య చికిత్సలు చేయించిన అనంతరం తిరిని ఆ విద్యార్థినితో పరీక్ష రాయించారు. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల ఇంటర్మీడియట్ నోడల్ అధికారులతోపాటు స్థానిక అధికారులు తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. ఎక్కడా కూడా మాస్కాపీయింగ్కు చోటు లేకుండా మొదటి రోజూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.