మహబూబ్ నగర్, జూలై 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిగ్నమయ్యారు. కరిగెట్లు చేస్తూ పొలాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతుబంధు డబ్బులు వేయడంతో ఆనందంగా వ్యవసాయం చే సుకుం టున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట మండలంలో 10 మిల్లీమీటర్లు, కౌకుంట్లలో 9 మి.మీ., బాలానగర్లో 7 మి.మీ., నాగర్కర్నూల్ జిల్లా వంగూరులో 9.8 మి.మీ., నాగర్కర్నూల్లో 9.03 మి.మీ., వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్ మం డలం సోలీపూర్లో 9.0 మి.మీ., గోపాల్పేటలో 7.0 మి.మీ., నారాయణపేట జిల్లా దామరగిద్దలో 13.02 మి.మీ., మద్దూరులో 10.02 మీ.మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.