కొల్లాపూర్, ఏప్రిల్ 30 : అన్నదాతల అభ్యున్నతికి ప్ర భుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. కొల్లాపూర్ ప ట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చై ర్మన్ పెబ్బేటి కృష్ణయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుల శ్రేయస్సును ఆలోచించే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.
రైతుల కోసం విడుతల వారీగా రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ సరఫరా, పంటల విక్రయానికి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సబ్సిడీపై ఎరువులు, మం దుల సరఫరా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదన్నారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా గ్రామాల్లోనే మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. వరి ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,060లు, బీ గ్రేడ్ రకానికి రూ.2,040 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్మన్ కిషన్నాయక్, మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మండల వ్యవసాయాధికారి నాగరాజు, సింగిల్విండో సీఈవో శ్రీనివాస్యాదవ్, డైరెక్టర్లు తాళ్ల పరశురాంగౌడ్, చాకలి నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు సాంబశివుడుయాదవ్, బరిగెల సత్యనారాయణయాదవ్, గోపాల మల్లయ్య, చంద్రశేఖరాచారి, వాకిటి ఆంజనేయులు తదితరులున్నారు.