జడ్చర్ల టౌన్, నవంబర్ 8 : సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్దిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదటగా బాబానగర్కాలనీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించగా, ప్రజలు మంగళహారతులతో పూలుచల్లుతూ స్వాగతించారు. అందరినీ ఎమ్మెల్యే ఆప్యాయంగా పలుకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే తాగునీళ్లు, కరెంటు కష్టాలు తొలగినయని మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. జడ్చర్ల పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు జరిగాయని, రూపురేఖలు మారిపోయాయని ప్రజలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధిలో ముందంజలోకి తీసుకెళ్లానని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతున్నదని ఎంఐఎం నాయకులు అన్నారు. పట్టణంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎంఐఎం నాయకులు జాకీర్అలీ, యాసర్, జావెద్, అజహర్, షకీల్, అన్వర్, ఇమ్రాన్, ఎండీ కవితోపాటు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు మాలిక్షాకీర్, కృష్ణారెడ్డి, రవీందర్, జాబేర్లతీఫ్, గడ్డం సాగర్, ప్రీతమ్, కాలేబ్, యాదిరెడ్డి, పెంటయ్య, ఇర్ఫాన్, కరాటే శ్రీను తదితరులు పాల్గొన్నారు.