హన్వాడ, మే 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు స న్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్ మేరకు మొక్కలు నా టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధమవుతున్నాయి. హన్వాడ మండలంలో 18లక్షల మొక్కలను నా టాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం ద్వారా 35 గ్రామా ల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలో ఐదు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది మండలంలో 5 లక్షల మొక్కలను నాటగా, ఈ ఏడాది రెట్టింపు మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుకోసం ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నర్సరీలను సంబంధిత అధికారులు నిరంత రం పర్యవేక్షిస్తూ మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవిలో మొక్కలు ఎండకుండా షెడ్ నెట్లను ఏ ర్పాటు చేశారు. నర్సరీల్లో కొబ్బరి, టేకు, వేప, చింత, వెదు రు, బత్తాయి, మునగ, మామిడి, జామ తదితర మొక్కల ను పెంచుతున్నారు.
జూలైలో మొక్కలను పంపిణీ చేస్తాం
జూలైలో మొక్కల ను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి ఉన్నతాధికారుల టార్గెట్ మేరకు నర్సరీ ల్లో మొక్కలను పెంచుతు న్నాం. మొక్కలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నాం. ఉపాధి హామీ సిబ్బందితో ప్రతి వారం సమావే శం నిర్వహించి నర్సరీల నిర్వహణను తెలుసుకుంటు న్నాం. నర్సరీల్లో అన్నిరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
– ధనుంజయగౌడ్, ఎంపీడీవో