ఊర్కొండ, జనవరి 29 : భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కాగా, సూర్యాపేట జిల్లాకు చెందిన సుస్మితను కొన్నేం డ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. అయితే, కొద్దిరోజులుగా సుస్మిత తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తితో తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆమెను నిలదీశాడు. దీంతో సుస్మిత శనివారం పుట్టింటికి వెళ్లిం ది.
ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వద్దకే తన భార్య వెళ్లిందన్న అనుమానంతో శనివారం రాత్రి గులికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపాడు.