ప్రగతి, యువతకు స్ఫూర్తి ప్రదాత, జననేత, తండ్రికి తగ్గ తనయుడు, అమాత్య కేటీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం పలు చోట్ల పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి పంపిణీతో సంబురాలు చేసుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్నగర్లో ఆల్ ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులు కలబంద మొక్కలపై మంత్రి కేటీఆర్ పేరు రాసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో కేక్లు కట్ చేసి మొక్కలు నాటారు. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి 50 మందికి కుట్టుమిషన్లు, 70 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గద్వాల జనరల్ దవాఖానలో ఎమ్మెల్యే బండ్ల కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. 35 మందికి డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూలై 24
నాగర్కర్నూల్, జూలై 24 (నమస్తే తె లంగాణ) : ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఐ టీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కృ షి చేస్తున్నారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు ఎ న్నో సేవలందించాలని కోరారు.
18 ఏండ్లు నిండిన వారికి డ్రైవింగ్ లైసెన్స్
పనికిరాని వాళ్లు చేసే చిల్లర రాజకీయాలను ప్రజలు నమ్మరని, వారి టైం అయిపోయిందని ఎమ్మెల్యే మర్రి తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నాగర్కర్నూల్ చరిత్రలోనే మొదటిసారిగా ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వేరేవారికి ఇలాంటి ఆలోచన రావాలంటే పదేండ్లు పడుతుందని.. ఇంప్లిమెంట్ చేసేందుకు మరో పదేండ్లవుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ లైసెన్స్ ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండిన యువతీయువకులకు ఉచితంగా లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. లైసెన్స్కు అ య్యే ఆన్లైన్ రుసుంను కూడా తామే చెల్లిస్తామన్నారు. రవాణా శాఖ నియమ నిబంధనల మేరకు ఎంపిక ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 18 ఏండ్లు నిండిన వాహనచోదకులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిబిరాన్ని ప్రారంభించామన్నా రు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్లకు సం బంధించిన దరఖాస్తు ఫారాలను విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, మార్కె ట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మాజీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువ కులు పాల్గొన్నారు.