మరికల్(ధన్వాడ), జనవరి 20 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యం గా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నా రు. ధన్వాడ మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వ ద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యాక్రమాన్ని ఆ యన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా కంటివెలుగు కార్యక్ర మం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పథకాలను దేశంలో ఉన్న సీఎంలు శభాష్ అంటున్నారన్నారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకుంటున్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, సర్పంచ్ అమరేందర్రెడ్డి, వైద్య బృందం, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, కంటి అద్దాలు ఏ విధంగా ఇస్తున్నారనే విషయాన్ని కలెక్టర్ పరిశీలించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో..
ధన్వాడ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమాన్ని క లెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో రామ్మనోహర్రావు, మరికల్ సర్పంచ్ గోవర్ధన్, ధన్వాడ సర్పంచ్ అమరేందర్రెడ్డి, వైద్యులు, ఎంపీవో బాలాజీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి, కార్యదర్శి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఊట్కూర్, జనవరి 20 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో కొనసాగుతున్న కంటివెలుగు కేంద్రాలను ఆయన సందర్శించారు. శిబిరానికి హాజరయ్యేందుకు రోజుకు 200 మంది వరకు ఇన్విటేషన్ ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద సమస్యలేమైనా ఉన్నాయా అని వైద్య బృందం సభ్యులను ప్ర శ్నించారు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్రావు, డీపీవో మురళి, ఎంపీడీసీ కాళప్ప, సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, సూరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల ఉన్నత పాఠశాలలో..
నారాయణపేట, జనవరి 20 : కంటివెలుగు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. శిబిరం పనితీరును వైద్య సిబ్బం ది, ఆశ వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. కంటి వైద్యులు అవసరమైతే తాను స్వ యంగా ఏర్పాటు చేస్తానని వైద్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో కంటివెలుగు మండల ఇన్చార్జి కన్యకుమారి, వైద్య శిబిరం డాక్టర్ మోనేశ్చారి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
కృష్ణ, జనవరి 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెం డో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ్కుమార్రెడ్డి అన్నారు. మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అ ద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మల్లేశ్, నరే శ్, మల్లేశ్వరమ్మ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పా ల్గొన్నారు.
శిబిరం పరిశీలన
నర్వ, జనవరి 20 : మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక దవాఖాన సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బం ది ఉన్నారు.
ప్రజలకు చక్కటి కంటిచూపు
మక్తల్ టౌన్, జనవరి 20 : ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో ప్రజలకు చక్కటి కంటి చూపు అందుతుందని కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అంధత్వాన్ని నివారించి కంటి చూపును అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అన్నారు. మున్సిపాలిటీలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరంలో 163 మంది, మంథన్గౌడ్లో 139 మంది, గుడిగండ్ల పల్లె దవాఖానలో 115 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు.