జడ్చర్ల, జనవరి 31 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగకు అత్యధికంగా క్వింటాకు రూ.7,346 ధర పలికింది. బుధవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు వేరుశనగ, కందులు, ఆముదాలు, ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, జొ న్నలు, బెబ్బర్లు, అమ్మకానికి వచ్చాయి. మార్కెట్కు 4,503 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.7,346, కనిష్ఠంగా రూ.4,002, మధ్యస్తంగా రూ.7,089 ధర పలికింది.
21క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా క్విం టాకు గరిష్ఠంగా రూ.9,649, కనిష్ఠంగా రూ. 9,179, మధ్యస్తంగా రూ.9,559 ధర పలికింది. 28 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 3,061 వచ్చింది. అదేవిధంగా జొన్నలకు క్వింటా కు గరిష్ఠంగా రూ. 5,622, బెబ్బర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ.6,851, మొక్కజొన్నకు క్వింటాకు గరిష్ఠంగా రూ.2,377, ఆముదాలు క్వింటాకు గరిష్ఠం గా రూ.5,070, పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ. 6,789 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.