కల్వకుర్తి, జనవరి 28 : ఆరుగాలం కష్టించిన వేరుశనగ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెక్క లు ముక్కలు చేసుకొని సాగుచేసిన వేరుశనగ ధర రోజురోజుకూ తగ్గుతుండడంతో రైతులు దిక్కుతోచ ని స్థితిలో పడిపోయారు. తాము పండించిన వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చి ధర కోసం వ్యాపారుల వంక దీనంగా చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవ లం మూడు రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ. 700 వరకు తగ్గుముఖం పట్టింది. రెక్కల కష్టానికి ఫలితం లేకపోయినా.. పెట్టుబడులు ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు ఆదివారం 234 మంది రైతులు 9,649 బస్తాల వేరుశనగను తీసుకొచ్చారు. మధ్యాహ్నం వ్యాపారులు రహస్య టెండర్లు వేశారు. మార్కెట్కు ఎక్కువ మొత్తంలో వేరుశనగ రావడంతో వ్యాపారులు సిండికేట్గా మా రి ధరలు తక్కువ వేశారనే ఆరోపణలు రైతుల నుం చి వెల్లువెత్తాయి. గురువారం నాటి ధరలను పోల్చుకుంటే క్వింటాకు రూ.700 తగ్గిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఆదివారం గరిష్ఠంగా రూ.7,315, కనిష్ఠంగా రూ.4,001, సరాసరి ధర రూ.6,221 పలికింది. నెలరోజులుగా చూస్తే దాదాపు క్వింటాకు రూ.1700 ధర తగ్గింది.
వ్యవసాయ మార్కెట్లో రైతుల పక్షాన మాట్లాడే వారే కరువయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ రద్దు కావడం తో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. రోజురోజుకూ వేరుశనగ ధరలు తగ్గుతున్నా.. ఎవర్ని ఏమి అడగాలో తెలియ ని పరిస్థితిలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రహస్యంగా టెండర్ వేస్తున్నాం.. ఇందులో సిండికేట్ ఏముందంటూ వ్యాపారులు వారి పని వారు చేసుకుంటూపోతున్నారు. తీరా నష్టపోతున్నది రైతులేనన్నది బహిరంగ సత్యం..
వేరుశనగ సాగుకు పెట్టుబడి చాలా ఎక్కువైందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనిష్ఠంగా 10 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి రావాలని రైతులు చె బుతున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఏడు క్వింటాళ్లు కూడా దాటడం లేదని వాపోతున్నారు. వేరుశనగ విత్తనాలు క్వింటా రూ.14వేలకు కొనుగోలు చేశామని, పొలం చదును, ఎరువులు, నూ ర్పిడి కూలీల ఖర్చు మొత్తం కలిస్తే ఎకరాలకు దాదా పు రూ.50వేల వరకు ఖర్చు వచ్చిందని, ఎకరా వేరుశనగ విక్రయిస్తే రూ.35వేల వరకు మాత్రమే వస్తుందని, చేసిన కష్టం కూడా గంగపాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.