మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 8 : ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జిల్లా కేంద్రంలోని స్టేడియాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ 15 నుంచి 21వ తేదీ వరకు ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు మైదానాన్ని పరిశీలించామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 6,275 అభ్యర్థులు అర్హత పొందగా.. 4,512 మంది పురుషులు 1,763 మంది మహిళలు హాజరుకానున్నారని తెలిపారు. పరిశీలించిన వారిలో ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ అశోక్, రిజర్వ్ సీఐలు సురేశ్, అప్పల నాయుడు, టెక్నికల్ టీమ్, ఎస్సై రాఘవేందర్, సిబ్బంది ఉన్నారు.