సిటీబ్యూరో: నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శాంతియుత పాదయాత్ర జీడిమెట్లలోని గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై, జేబీఎస్ వరకు కొనసాగింది. నార్త్ సిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘మేడ్చల్ మెట్రో మన హక్కు’ ‘మెట్రో ఫేజ్-2 తక్షణమే ప్రారంభించాలి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. త్వరలో శాంతియుత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సమితి సభ్యులు సంపత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు తెలిపారు.