గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ జెండాను అధికారులు, నాయకు లు ఆవిష్కరించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అధికారులు, పాఠశాల యాజమన్యం బహుమతులను ప్రదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, నాయకులు, ఆయా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.