నవాబ్పేట, మార్చి 13 : నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా ట్యాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి పంచాయ తీ అధికారులు స్పందించారు. పంచాయతీ కార్మికులకు మూ డు నెలల నుంచి జీతాలు ఇ వ్వకపోవడంతో విధులు బహిష్కరించి ఇతర కూలీ పనులకు వెళ్తున్నారనే కథనం వెలువడింది. ఈ కథనానికి మండల పంచాయతీ అధికారి బద్రూనాయక్ వెం టనే స్పందించారు.
మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక నెల జీతం విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయా గ్రామా ల పంచాయతీ కార్యదర్శులు జీపీ నిధుల నుంచి బుధవారం ఒక నెల (డిసెంబర్) వేతనాలు చెల్లించారు. జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు కూడా మరో రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించడంతో మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులు విధుల్లో చేరారు. మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగిం చి జీపీ ట్రాక్టర్లో డంపింగ్ యా ర్డుకు తరలించారు.
అలాగే గ్రామం లో పేరుకుపోయిన మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు మహి ళా స్వీపర్లు మండల కేంద్రంలోని వీధులన్నీ శుభ్రపర్చారు. ఈ సందర్భంగానే మండల పంచాయతీ అధికారి బద్రూనాయక్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ మండలంలోని అన్ని జీపీల కార్మికులకు ఒక నెల వేతనం వారి ఖాతాల్లో జమ చేశామని, మరో రెండు నెలల వేతనాలు రెండు రోజుల్లో జమ చేస్తామని చెప్పారు.