గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సందడి ప్రారంభం కానున్నది. వరి కోత దశకు రావడంతో వ్యవసాయశాఖ ఆదేశాను సారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో రేపటి నుంచి ప్రారంభి ంచాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 823 కేంద్రాలను ఐకేపీ, మెప్మా, పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో మండలానికో సెంటర్ చొప్పున విడుతల వారీగా షురూ చేయనున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 ధర ఖరారు చేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర లభించనుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– నాగర్కర్నూల్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)
రైతులు ఈ యాసంగిలో సాగు చేసిన వరి పంటలు చాలా వరకు కోతదశకు చేరుకున్నాయి. గతేడాది వాన కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద ఆయకట్టు విస్తీర్ణం తగ్గింది. బోర్లు ఉన్న రైతులే ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపారు. ఏప్రిల్ రెండు, మూడోవారం నుంచి ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశమున్నది. కాగా అదే సమయానికి అకాల వర్షాల ప్రభావం ఉండనున్నది. దీంతో ముందస్తు జాగ్రత్తగా వ్యవసాయ శాఖ ఏప్రిల్ ఒకటో నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చేందుకు చర్యలు తీసుకున్నది. ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు కొనుగోలు కేంద్రాల ప్రారం భంపై సూచనలు ఇచ్చింది.
గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ, మెప్మాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సంబంధిత శాఖల అధికారు లతో సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కచ్చితంగా ఏప్రిల్ 1న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఫలి తంగా మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో కేంద్రాలు అందుబాటులోకి రాను న్నాయి. ఇందుకోసం ప్రభుతం మద్దతు ధరలను కూడా ఖరారు చేసింది. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు ధర రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున నిర్ణయించింది.
సేకరించిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖా తాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. వారంలోగా ధాన్యం కొనుగోలు డబ్బులను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదే శించారు. కాగా ఇప్పటికే గ్రామాల్లో ఏఈవోలు, మహిళా సంఘాలు, ఇతర అధికారుల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పా టుపై రైతులకు అవగాహన కల్పి స్తున్నారు. మద్దతు ధరతో నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించి లాభం పొందాలని సూచిస్తున్నారు. అయితే దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసు కోవాల్సిన అవసరం ఉన్నది. కొనుగోలు కేంద్రాల వద్ద దళారులతో కుమ్మకై రైతులకు మద్దతు ధర దక్కకుండా చేసే చర్యలను అధికారులు నియం త్రించాల్సి ఉంది. తేమ, తరుగు పేరుతో రైతులను గతంలో మోసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రా ంగం సన్నద్ధమవ్వడంతో కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణను అధికారులు విస్మరించే అవకాశం లేకపోలేదు. దీన్ని ఆయా సంఘాలు, దళారులు సొమ్ము చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాటి నుంచి చివరి గింజ సేకరించే వరకు నిరంతరం పర్యవేక్షణ చేయాలని రైతులు అభిప్రాయ పడుతున్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలో 64కేంద్రాలకు గానూ మొదటి విడుతగా 32 కేంద్రాలు, ఏప్రిల్ 10వ తేదీ తర్వాత మరో 32కేంద్రాలను ప్రారంభించ నున్నారు. నారాయణపేట జిల్లాలో 123, నాగర్క ర్నూల్లో 202, మహబూబ్నగర్లో 190, వనపర్తిలో 244 కేంద్రా లను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 823 సెంటర్లు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో ఏప్రిల్ 1న మండలానికొకటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభి స్తున్నం. ఐకేపీ, మెప్మా, పీఏసీసీఎస్ల ఆధ్వర్యంలో 202 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్ మూడో వారం నుంచి అన్ని కేంద్రాలకు ధాన్యం పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది. దీనికి అనుగుణంగా కేంద్రాల ప్రారంభానికి ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో 1.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాం.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్