తెలకపల్లి, ఆగస్టు 30 : ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవాఖానలో వసతులు మెరుగుపడి రోగులకు మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఔషధ, కేసీఆర్ కిట్టు వంటి పథకాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. దీంతో ప్రతినెలా ఐదు నుంచి పది మంది కాన్పు ల కోసం మండలకేంద్రంలోని పీహెచ్సీకి వస్తుంటారు. అంతే గాకుండా ప్రతిరోజూ 130 మం ది దాకా అవుట్ పేషెంట్లు వస్తుంటారు. వీళ్లందరికీ మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కేటాయించిన నిధు లు ఉపయోగపడే అవకాశం ఉం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరగనున్న వసతులు..
ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించడంతో మరిన్ని వసతులు మెరుగుపడే అవకాశం ఉంది. చికిత్స కోసం దవాఖానకు వచ్చే రోగులకు వేటింగ్ హాలిడేతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిధుల కేటాయింపుతో పలు సమస్యలు తీరే అవకాశం ఉంది. నిధుల కేటాయింపు మీడియాలో మాత్రం చూశాను ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది.
-డాక్టర్ దశరథం, తెలకపల్లి
రోగులకు మెరుగైన సేవలందుతాయి..
పీహెచ్సీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. వసతులు మెరుగుపడడం వల్ల మరింత మంది వైద్య సేవ కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. తెలకపల్లితోపాటు వివిధ గ్రామాల నుంచి నిత్యం అనేక మంది వైద్యం కోసం దవాఖానకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే రోగులకు అనేక సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
– రాజ మహేందర్రెడ్డి, తెలకపల్లి