న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నది. పంజాబీ యువత డ్రగ్స్(Zombie Drugs) బానిసై.. జాంబీలుగా మారిపోతున్నట్లు తన వీడియోలో ఎంపీ హర్భజన్ ఆరోపించారు. ఇటీవల బీజేపీలో చేరిన హర్భజన్.. పంజాబ్ సర్కారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తలపాగా కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు జాంబీల తరహాలో నిలబడి ఉన్న వీడియోను టర్బనేటర్ తన ఎక్స్లో షేర్ చేశారు. పంజాబ్ను ఎలా మార్చారో చూడండి అంటూ ఆయన కామెంట్ చేశారు. తన పంజాబ్పై చెడు దృష్టి పడిందని ఆరోపించారు. పంజాబ్ను, పంజాబీ యువతను ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినట్లు హర్భజన్ ఆరోపించారు. ఈ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి. జాంగీ డ్రగ్గా పిలువబడే గ్జైలజైన్ డ్రగ్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తులు అలా మారినట్లు తెలుస్తోంది.
ਨਜ਼ਰ ਲੱਗ ਗਈ ਯਾਰ ਸਾਡੇ ਪੰਜਾਬ ਨੂੰ… 💔
ਸਰਕਾਰਾਂ ਨੇ ਕੀ ਹਾਲ ਬਣਾ ਦਿੱਤਾ ਪੰਜਾਬ ਦਾ ਤੇ ਪੰਜਾਬੀ ਨੌਜਵਾਨਾਂ ਦਾ। ਰੋਣਾ ਆਉਂਦਾ ਏ ਇਹ ਸਭ ਦੇਖ ਕੇ। 😢
ਬਖ਼ਸ਼ ਦਿਓ ਮੇਰੇ ਪੰਜਾਬ ਨੂੰ… ਮਾਫ਼ ਕਰੋ ਪੰਜਾਬ ਨੂੰ। 🙏
ਕਿੱਥੇ ਲੈ ਆਏ ਓ ਪੰਜਾਬ ਨੂੰ?
ਜਿਹੜਾ ਪੰਜਾਬ ਕਦੇ ਚੜ੍ਹਦੀ ਕਲਾ, ਹਿੰਮਤ ਤੇ ਬਹਾਦਰੀ ਲਈ ਜਾਣਿਆ ਜਾਂਦਾ ਸੀ, ਅੱਜ ਉਸੇ ਪੰਜਾਬ… pic.twitter.com/RAp3aYy0i2— Harbhajan Turbanator (@harbhajan_singh) August 10, 2026
ఎంపీ హర్భజన్ పోస్టు చేసిన వీడియోపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోను పంజాబ్లో షూట్ చేయలేదని ఆప్ నేత , పంజాబ్ ఆర్ధిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. బీజేపీ పంజాబ్ సర్కారును అపఖ్యాతికి గురి చేస్తున్నదని పేర్కొన్నారు. రాజస్థాన్లో తీసిన వీడియోకు పంజాబ్ అని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుజరాతీ పోర్టుల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంటున్నారని, అక్కడ నుంచి ఆ డ్రగ్స్ పంజాబ్కు వస్తున్నట్లు చీమా ఆరోపించారు. తాజా భజ్జీ పోస్టు చేసిన వీడియోను రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.
क्या यह भी राजस्थान की तस्वीरे है ? बात पंजाब की drug समस्या की है ।आपके paid troll से यह मुद्दा छिपाया नहीं जाएगा ।इस पर काम करना पड़ेग । जिम्मेदारियों से भागने से हल नहीं निकलेगा । बात किसी व्यक्ति विशेष को टारगेट करने की नहीं है । पंजाब और पूरे देश मे जो भी सेवन करता है नशीले… pic.twitter.com/Ct802htEq5
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 11, 2026