మహబూబ్నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం ఆయన మూసాపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు.
గతంలో విద్యుత్, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని, సర్పంచులు ప్రజలకు జవాబుదారీగా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
ప్రస్తుతం విద్యుత్కు ఎలాంటి సమస్య లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వేసవిలో చెరువులు, కుంటలు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తానని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎన్నో ఇబ్బందులు మూసాపేట మండలం తీసుకువచ్చాం. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
రైతులు ప్రతి వారం రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని వాగులపై చెక్ డ్యాములు నిర్మిస్తున్నాం.
నిజలాపూర్ చెరువు ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం’’ అని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ కళావతి, మూసపేట సర్పంచ్ అన్నపూర్ణ, రైతుబంధు మండల కో -ఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, వ్య వసాయశాఖ సహాయ సంచాలకులు యశ్వంతరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి