తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నడంతో రగడ రాజుకుంటున్నది. రాష్ట్రంలోని ఉన్న చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేలా ఉండేందుకు వీలుగా కేసీఆర్ రాజముద్రలో కళాతోరణానికి స్థానం కల్పించారు. ఇప్పుడు సర్కారు అనాలోచిత నిర్ణయంతో చారిత్రక సంపదకు గుర్తింపు లేకుండా చేసే చర్యలకు పాల్పడుతున్నది. ఇలాంటి నిర్ణయాలు తెలంగాణ సంస్కృతికి తూట్లు పొడుస్తాయని, మన ఆత్మగౌరవం సైతం దెబ్బతింటుందని కవులు, కళాకారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ చర్యలు రాష్ట్ర సమాజానికి మంచివి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భాష, ఆచార సంప్రదాయాలకు తలమానికంగా చరిత్రలో తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. వీరవనిత రుద్రమదేవి శౌర్యానికి ప్రతీకగా కాకతీయుల కాలం నాటి తోరణం, గో ల్కొండ నవాబుల కాలంలో భిన్న సంస్కృతులకు నిలయంగా హైదరాబాద్లో చార్మినార్ను ని ర్మించారు. భవిష్యత్తు తరాలకు తెలంగాణ ప్రాంత పూర్వికుల చరిత్ర తెలిసేలా, సంస్కృతికి అద్దం పట్టేలా చారిత్రక కట్టడాలను నిర్మించారు. మన సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మించిన కట్టడాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర లోగోను ఏర్పాటు చేసింది. మన సంస్కృతికి ప్రతీకగా శాతవాహనులు, కాకతీయులు, బహుమనీయులు, కుతుబ్షాహీలు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు పాలించిన కాలంలోని అంశాలను భవిష్యత్తు తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు లోగోను రూపొందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి తూట్లు పొడుస్తూ.. సంప్రదాయాలను మట్టిపాలు చేస్తున్నది. ఉద్యమకారుల బలిదానాల మీద ఏర్పడిన రాష్ట్ర లోగోను మార్చే విషయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలి. రాజకీయాలకతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి.
చార్మినార్, కాకతీయ తోరణాలు రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో గుర్తింపు పొం దిన చారిత్రక కట్టడాలు. గత పాలకులు కష్టజీవులు, కార్మికులు, ఉద్యమకారుల కష్టసుఖాల ను ప్రతిబింబించేలా లోగోను తయారు చేశారు. ఒక వ్యక్తిని, ఒక ప్రాంతాన్ని తక్కువ చేసేలా లోగోను రూపొందించొద్దు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ ఐదేండ్లకోసారి మారే పాలకుల సొంత నిర్ణయాలపై లోగోలు మార్చడం సరైన పద్ధతికాదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబిస్తూ.. రాష్ట్ర ఖ్యాతిని పెంచేవిధంగా, రాజకీయాలకతీతంగా లోగో మార్పుపై నిర్ణయం తీసుకుంటే బాగుంటది.
రాచరిక చిహ్నాలంటూ రేవంత్రెడ్డి తన ముద్రను ఉంచుకోవాలనుకుంటున్నడు. ఇది రెడ్డి పరిపాలన కాదు.. తెలంగాణ పరిపాలన. కాకతీయ తోరణం, చార్మినార్ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు. ఆనాడు రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో సమావేశాలు నిర్వహించి తీసుకున్నటువంటి అద్భుతమైన కళాఖండం. తెలంగాణ నేలలో పాటలు, జానపదాలు, సంగీతానికి కొదువలేదు. ఎందరో రచయితలు, సంగీత కళాకారులున్నారు. సాయుధ పోరాటంలో రాచరిక పాలనకు విముక్తి ఆనాటి పాటలు. దుర్గార్మపు పాలనను గద్దె దించినటువంటి ఎన్నో ఉద్యమ గేయాలు, పాటలు పుట్టలకొద్దీ ఉన్నాయి. మన పాటకు మన బాణి తెలంగాణ ఆత్మగౌరవం కాని.. ఇంకా వలసాంధ్ర సంగీతకారులతో పాట పాడించుకునే దుస్థితిలో తెలంగాణ గాయకులు లేరు. దీనిని తెలంగాణ నేల సహించదు. ఈ రోజు గుర్తులను మార్చినోడు.. రేపు ఊరును మార్చుతడు.. రాష్ర్టాన్ని మార్చుతడు.. ఆంధ్రప్రదేశ్కు పచ్చజెండా ఊపుతూ లోగోలను మార్చడం ప్రజాపాలన కాదు.. దుర్బుద్ధికి తార్కాణం.