ఆడపిల్లలంటే ఇష్టంలేదని కొందరు.. తప్పు చేసి గర్భందాల్చి మరికొందరు.. కారణమేదైనా పురిట్లోనే పసికందును చిదిమేస్తున్నారు.. వివిధ కారణాలతో గర్భందాల్చిన వారు, ఆడబిడ్డ ఇష్టం లేక, ఇతరాత్ర కారణాలతో వచ్చిన వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీ త్యా నేరమని తెలిసినా జోగుళాంబ గద్వాల జిల్లాలో వి చ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– గద్వాల అర్బన్, జూన్ 19
జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి పలు స్కానింగ్ సెంటర్లు, దవాఖానల నిర్వాహకులు కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డా, మగబిడ్డా అనేది ప్రసావానికి ముందే నిర్ధారిస్తున్నారు. ఫలితంగా జిల్లా లో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువగా నమోదవుతున్నది. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తగ్గుతున్న బాలికల సంఖ్య
గతంతో పోలిస్తే బాలికల జనాభా చాలా తక్కువ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం 10మంది యువకులకు నలుగురు చొప్పున అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవ డం, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితె వెంటనే అబార్షన్ చేయించడంతో బాలికల సంఖ్య తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అవసరాలే ఆసరాగా..
గద్వాల, అలంపూర్, అయిజ పట్టణాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రైవేట్ దవాఖాన, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధ్దమని బోర్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పలువురు అర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యు లు, ఆశ కార్యకర్తలు, కొంతమంది వ్యక్తులను నియమించుకొని పలువురు లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకొని దాదాపు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు పరీక్షల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి రెండు, మూడోసారి గర్భందాల్చిన మహిళలు లింగ నిర్ధారణకు అధికంగా వస్తున్నారు.
ఇష్టారీతిగా అబార్షన్లు..
జిల్లాకేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో దవాఖానల నిర్వాహకులు ఇష్టారీతిగా అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. వివాహేతర సంబంధాల వల్ల గర్భందాల్చిన మహిళలు, ఇతర కారణాలతో మరికొందరు అబార్షన్లకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గర్భిణులు ఆరోగ్యపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకుంటే వైద్యాధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోవడం లేదు.
నిబంధనలు ఇవి..
కడుపులో పెరుగుతున్న బిడ్డకు జన్యుపరమైన లోపాల కోసం, శిశువు పెరుగుదల ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. కడుపులోని బిడ్డ ఆడో, మగో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. లింగ నిర్ధారణకు సహకరించిన వారికి 3నెలల జైలు, రూ.10వేల జరిమాన విధిస్తారు. రెండోసారి సైతం ఇదే తప్పు చేసిన వారికి ఐదేండ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధించే అవకాశముంది. వైద్యులు దోషులుగా తేలితే లైసెన్స్ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసి కొద్దిరోజులు రద్దు చేసే అవకాశముంది. గర్భంలోని శిశువుకు లింగ నిర్ధారణ చే యమని కోరినా మూడేండ్ల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాల్సిన అవసరం ఉన్నది.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధం
దవాఖానలు, స్కానింగ్ సెంటర్లల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధం. ఎవరైనా పరీక్షలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కా నింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఎంతటివారైనా సహించేదిలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– శశికళ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జోగుళాంబ గద్వాల