గద్వాల న్యూటౌన్: ప్రజల గొంతుకగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల గద్వాల మండలంలోని గోన్పాడు గ్రామం వద్ద రూ. 30లక్షల వ్యయంతో షాదీఖాన నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు.
ఆనంతరం సంగాల రిజర్వాయర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మినిపార్కును ప్రారంభించి ఫ్లాగ్ను ఆవిష్కరించారు. పార్కు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ను చూసేందుకు ఆభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
పూల వర్షం, మంగళ వాయిద్యాలతో కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.