కొల్లాపూర్ రూరల్, మే 4 : ఐరోపా దేశాల నుంచి ఫ్లెమింగో (ఒంటి కాళ్లపై జపం చేసే ఎర్రకాళ్ల కొంగలు) మన జిల్లాకు అతిథులుగా వస్తున్నాయి. దాదాపు పది, పదిహేనేండ్లుగా విదేశాల నుంచి వచ్చే ఈ పక్షులు కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి ప్రాంతంలో పారుతున్న కృష్ణానది తీర ప్రాంతానికి వలసొస్తున్నాయి. ఏడాదిలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలపాటు ఇక్కడే మకాం వేసి నదిలోని చేపలను ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత వ ర్షాకాలంలో నదికి వరద ప్రారంభం కాగానే తిరిగి వెళ్లిపోతుంటాయి. చాలా వరకు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుత వేసవిలో వేలాదిగా వ చ్చిన పక్షులు నదీతీర ప్రాంతంలో కనువిందు చేస్తున్నా యి. మత్స్యకారులు, స్థానికులు వీటిని చుట్టాల్లాగానే చూసుకుంటున్నారు. వీటికి హాని తలపెట్టరు. కొంగలు ఒంటి కాళ్లపై జపం చేస్తుంటే కళ్లు తిప్పుకోకుండా చూ స్తుంటారు. ఈ పక్షులు ముంబాయిలోని సముద్ర తీ రం వెంట మాత్రమే కనిపిస్తున్నాయి.
తర్వాత తెలంగాణలోని మన ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాయి. కాగా విదేశాల నుంచి వచ్చే ఈ పక్షి చుట్టాలకు ఇక్కడ నదిలో ఏర్పాటు చేసిన 760 కేవీ విద్యుత్లైన్ మృత్యుపాశంగా మా రింది. దాదాపు 6 ఫీట్ల వరకు ఎత్తు పెరిగే ఈ పక్షులు ఆకాశంలో విహరించే సమయంలో మంచాలకట్ట ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల దరిదాపుల్లోకి వెళ్లగానే షాక్కు గురై పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ విద్యుత్ లైన్ల గుత్తేదారు కంపెనీ అదాని గ్రూప్నకు చెందింది కాగా.. వీటిని నిర్మించే సమయంలో బర్డ్ఫై డైవర్టులు, బర్డ్ రిఫ్లెక్టర్లు ఏర్పా టు చేయలేదు. నదిని అనుసరించి పెద్దదైన నల్లమల అటవీ ప్రాంతం ఉండగా.. ఫారెస్ట్ అధికారులు అటవీ జంతువులు, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటే.. ఇంత పెద్ద కంపెనీ మాత్రం చర్యలు చేపట్టకపోవడం ఏమిటని పక్షి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ తీగలు విదేశీ కొంగలకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఫ్లెమింగోలు మృతి చెం ది పడుతున్నా సంబంధిత కంపెనీ మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు కు వందల సంఖ్యలో చనిపోవడం బాధగా ఉన్నదని మత్స్యకారులు వాపోతున్నారు.
గుత్తేదారుల నిర్లక్ష్యం.. కొంగలకు శాపం
హైటెన్షన్ లైన్ల వద్ద గుత్తేదారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అరుదైన జా తి పక్షులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఫ్లెమింగోల భద్రత కోసం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం బోర్డులు ఉ న్నాయి. కానీ మన రాష్ర్టానికి వచ్చి స్థిరపడిన ఈ కొం గల గురించి ఇక్కడి అధికారులకు అవగాహన లేకపోవడం కూడా వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతున్నది. హైటెన్షన్ లైన్ల వద్ద వన్యప్రాణులపై తక్కువ ప్రభావం చూపేలా ట్రాన్స్ మిషన్ లైన్ వేయడం, దాని అనుబం ధ పనులు జాగ్రత్తగా నిర్వహించాలని బోర్డు అధికారు లు నిర్ణయించారు. ఫ్లెమింగోల భద్రత కోసం, విద్యుత్ సంస్థ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. బర్డ్ఫ్లై డైవర్టులు, బర్డ్ రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించి నా.. ఇక్కడ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డం శోచనీయం. వన్యప్రాణులు, పక్షుల కోసం మనం కల్పించిన రక్షణ చట్టాలకు మోదీ చుట్టాలు తూట్లు పొ డుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అరుదైన పక్షుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మత్స్యకారులు, స్థానికులు కోరుతున్నారు. కాగా, పక్షుల మరణాల విషయంపై పరిశీలిం చేందుకు నేడు బయోలజీ నిపుణులు, ఫారెస్ట్ అధికారులు రానున్నారు.