మహబూబ్నగర్ అర్బన్, మే 4 : కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లోని న్యూ టౌన్ పార్టీ కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జహంగీర్, అతిక్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు శ నివారం శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సమక్షంలో కారెక్కారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అధికారం కోసం హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హ యాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు అండగా నిలిచామన్నారు. వేసవిలో నీటి కొరత లేకుండా మిషన్ భగీరథ ద్వారా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేశామని, మరోమారు తనను ఎంపీగా గెలిపిస్తే పాలమూరును మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి మన్నె అన్నారు. హన్వాడ మండలాన్ని అభివృద్ధి చేసిన శ్రీనివాస్గౌడ్కు పార్టీలో చేరిన నాయకులు కృతజ్ఞత లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోసం చేసిందని, మైనార్టీలకు అండగా నిలిచిన కేసీఆ ర్ ప్రభుత్వమే బాగుందని.. అందుకే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నాయకులు జహంగీర్, అతిక్ తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపిస్తామని వారు హామీ ఇచ్చారు.
జాతీయ పార్టీలను ఓడించాలి
కాంగ్రెస్, బీజేపీలను ఓ డించి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం హన్వాడలో బీఆర్ఎస్ అభ్యర్థి మ న్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్ర చారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రుణమాఫీ, రైతుబంధు వేస్తామని నేటికీ అమలు చేయలేదన్నారు. 200 యూనిట్ల ఉచి త కరెంట్ ఇస్తామని చెప్పి.. ఐదు నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. అబద్ధాలతో అ ధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను.. కుల, మతా ల పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజ లు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాస్కర్, లక్ష్మయ్య, బా లయ్య, జంబులయ్య, నాగన్న, ఖాజాగౌడ్, అనంద్, శ్రీనివాసులు, రామణారెడ్డి, బసిరెడ్డి, మాధవులు, అంజి తదితరులు పాల్గొన్నారు.