హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా మల్యా ల ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతుల లేమి కారణంగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కేవలం ప్రమాదం కాద ని, విద్యాశాఖ, హాస్టల్ సంక్షేమ అధికారుల వైఫల్యం వల్ల జరిగిన ప్రభు త్వ హత్యలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాఠశాలకు మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి బాత్రూములకు నీటి సరఫరా లేక విద్యార్థులు బహిర్భూమికి వెళ్లా ల్సి వచ్చి ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోడానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవాలనుకోవడం దారుణమని, మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.