గద్వాలటౌన్, నవంబర్ 14: కాంక్రిట్ జంగిల్గా మారిన గద్వాల పట్టణానికి కొ త్త రూపురేఖలు అద్దారు.. రోజురోజుకు కాలుష్యంతో దిగజారిపోతున్న ప్రాణవాయివుకు కొత్త ఊపిరి పోశారు. ప్రతినిత్యం ఆహ్లాదమైన వాతావరణంలో ప్రజలు ఉం డేలా.. ఉత్సాహంగా గడిపేలా పార్కులను తీర్చిదిద్ధారు.. పట్టణ నలుమూలల పచ్చదానాన్ని పరిచారు.. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. పట్టణ ప్రగతి, ఎస్డీఎఫ్ నిధులు రూ.9కోట్ల90లక్షలతో 33పార్కులను నిర్మించారు. అం తేకాక వ్యాయామశాల.. వాకింగ్ జోన్లు ఆలా పలు ఏర్పా ట్లు చేశారు.. ఇది కదా అభివృద్ధి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి.గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 37వార్డులు ఉన్నాయి. ప్రతివార్డులో పచ్చటి పచ్చదానా న్ని పరిచేలా, వార్డుల ప్రజలకు అహ్లాదమైన వాతావరణం కల్పిచేందుకు హరితహారం స్ఫూర్తితో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రత్యేక చొరవతీసుకున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కుల నిర్మాణాలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం స్ఫూర్తితో పట్టణంలో రూ.7 కోట్ల 74లక్షలు వెచ్చించి ప్రజలకు ఆహ్లాదమైన వాతావరణాన్ని అందించేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కృషి చేశారు. రూ.7కోట్ల నిధులతో 33 పార్కులను ఏర్పాటు చేశారు. అలాగే 20కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్, 12కిలో మీటర్ల మేరా 50వేల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి ప్రజలకు నీడ ఇవ్వడమే కాకుండ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. లక్షాపదివేల మొక్కల సామర్థ్యం కలిగిన నర్సరీని ఏర్పాటు చేశారు. పీజేపీ కుడి కాలువ పక్కన మురికికూపంగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి రూ.60లక్షలు వెచ్చించి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. రూ.14లక్షలు వెచ్చించి ట్రాఫిక్ ఐలాండ్ను గ్రీన్ ఐలాండ్లుగా మార్చారు.
పట్టణంలోని రాజీవ్మార్గులోని స్మృతివనాన్ని పట్టణ ప్రగతి నిధుల రూ.40లక్షలతో ఆహ్లాదంగా తీర్చిదిద్ధారు. అలాగే పట్టణ ఔటర్రింగ్ రోడ్డు పక్కన ఉన్న సంగాల చెరువు వద్ద ఎస్డీఎఫ్ ని ధులు రూ.కోటి 75లక్షలతో అన్ని వసతులు క ల్పిస్తూ పార్కను ఏర్పా టు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యే క చర్యలు తీసుకున్నారు. జాతీయ భావాన్ని గుండెలనిండా నింపేలా అతిపెద్ద జాతీయ పథాకాన్ని ఏర్పాటు చేశారు. చెరువులో సందర్శకులు బోటింగ్ చేసేలా సౌకర్యం కల్పించారు.
మారుతున్న జీవన విధానం, వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కుల నిర్మాణం చేపట్టింది. చిన్నారులు, పెద్దలు ఆకర్షించేలా విభిన్నవిభిన్న థీమ్లు, పరికరాలతో పార్కులను అందుబాటులోకి తెచ్చారు. పెద్దలు వాకింగ్, చిన్నారులు ఆడుకునేలా అన్ని వసతులు సమకూర్చారు. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.