జోగులాంబ గద్వాల : కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. కాగా, పార్టీ నుంచి 2లక్షలు బీమా చెక్కు రావడంతో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్త యువరాజ్ ఇంటికి వెళ్లి అతడి భార్య భారతమ్మకు చెక్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..యువరాజ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను పార్టీ సభ్యత్వం తీసుకుకోవడంతో ఆర్థిక సాయం అందజేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంల పొందిన వారు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా పార్టీ కల్పిస్తుందన్నారు.
ఈ సౌకర్యం కల్పించి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, ఎంపీటీసీ శంకర్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు రమేష్ నాయుడు, లక్ష్మీకాంత్ రెడ్డి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.