జెడ్పీ చైర్పర్సన్ సరిత
బాస్కెట్బాల్ టోర్నీ మహిళల విజేత సౌత్ సెంట్రల్ రైల్వే
పురుషుల విజేత హైదరాబాద్ కేవీబీఆర్
ట్రోఫీలను అందజేసిన జెడ్పీచైర్పర్సన్,ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల
అయిజ, ఫిబ్రవరి 9: గ్రామీణ క్రీడాకారులకు బాస్కెట్బాల్ను చేరువ చేయాలనే సంకల్పంతోనే ఉత్తనూర్లో అంతర్రాష్ట్ర బాస్కెట్బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలంలోని ఉత్తనూర్లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన బాస్కెట్బాల్ ఫైనల్ పోటీలను ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మినహా ఎక్కడాలేని విధంగా బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సీనియర్ నేత తిరుమల్రెడ్డి ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. బాస్కెట్బాల్ టోర్నీతో ఉత్తనూర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అంతర్రాష్ట్ర బాస్కెట్బాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మహిళల జట్టు విజేతగా నిలిచింది. అనంతరం టీఆర్ఎస్ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి ఉత్తనూర్కు రావడంతో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో అయిజ టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు నాగేశ్వర్రెడ్డి, రాజారెడ్డి, విజయ్, గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాల నర్సింహులు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు మహబూబ్ పాషా, రఘునాథ్రెడ్డి, ఉత్తనూర్ బాస్కెట్బాల్ కార్యదర్శి కొట్టం నీలిమ, సీనియర్ కోచ్ నయీముద్దీన్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
రైతుల సంతోషానికే సంబురాలు
రైతుల సంతోషం కోసమే రైతు సంబురాలను నిర్వహిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఉత్తనూర్లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నేత తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. అనంతరం బండలాగుడు పోటీల విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్శ్రేణులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.