గద్వాల : ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాసతో ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు, పట్టీలు, కడాలు, ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ టి.శ్రీనివాస్ రావు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిందితుడి నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శేరెల్లివీధిలో బలిజ లక్ష్మి (55)హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఏఎస్పీ శంకర్, డీఎస్పీ వై మొగులయ్య గద్వాల్ సీఐ టి.శ్రీను, గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్ఐ నందీకర్, ధరూర్ ఎస్ఐ శ్రీహరి, గద్వాల టూ టౌన్ ఎసై సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.