జోగులాంబ గద్వాల : సబ్బండ వర్ణాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని అనేక సంక్షేమలు పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటు లేదన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిడం ఖాయమన్నారు. ప్రతి పక్షపార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవదన్నారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడు కుంటామని, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ గెలుపుకోసం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.