జోగులాంబ గద్వాల : విద్యుత్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు..
సీఎం కేసీఆర్ సహకారంతో విద్యుత్ శాఖ ద్వారా 500 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించామన్నారు. గద్వాల నియోజకవర్గంలో ప్రతి మండలానికి 100 ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందజేస్తామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్ , జిల్లా విద్యుత్ అధికారి భాస్కర్, నాయకులు, కార్యకర్తలు విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.