నారాయణపేట టౌన్, ఆగస్టు 11 : పిల్లలకు కొత్త గా ప్రవేశపెట్టిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన వైద్య అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఐ దేండ్ల లోపు వయస్సు పిల్లలకు వచ్చే న్యూమోకోకల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ప్రవేశ పెట్టారని, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన క ల్పించి, పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ తీసుకునే విధం గా చూడాలని పేర్కొన్నారు.
పిల్లలకు కొత్తగా వస్తున్న న్యూమోకోకల్ వ్యాధి, వాటి లక్షణాలు, టీకా ఆవశ్యకతపై ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిం చి, దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నా రు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామ్మనోహర్రావు మాట్లాడుతూ ఐదేండ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి వస్తే జ్వరం రావడం, ఊపిరితిత్తుల సమస్య తలెత్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వ స్తాయని తెలిపారు. సకాలంలో వైద్యం అందని పక్షంలో ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన వివరించారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు న్యూమోకొకల్ కాంజుగేట్ (పీసీవీ) కొత్త టీకాను ప్రవే శ పెట్టామన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి డోస్ 6 వా రాల్లో ఇవ్వాలని, రెండో డోస్ 14వ వారం, బూస్టర్ డోస్ను 9 నెలలకు ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి బిడ్డకూ టీకా ఇవ్వడం వల్ల న్యూమోకోకల్ వ్యాధి నుంచి బయట పడవచ్చని ఆయన తెలిపారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రరెడ్డి, డాక్టర్ శైలజ, డాక్టర్ రవీందర్, జి ల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.