మక్తల్రూరల్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం మక్తల్ మండలంలోని దాదాన్పల్లి, ముష్టిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ‘ మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ’ ప్రభుత్వ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గర్భిణులకు కాన్పులు కాగానే కేసీఆర్ కిట్ ద్వారా 12 వేల రూపాయల సహాయం, ఎవరైనా రైతులు చనిపోతే రైతు బీమా ద్వారా వారి కుటుంబానికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ అందజేస్తున్నారన్నారు. రైతు భీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.2,300 కోట్లు భీమా కంపెనీలకు చెల్లిస్తుందన్నారు.
ఇటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అలాగే రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. వృద్ధులకు ప్రతినెల రూ.2016 పింఛన్లు ఇస్తుందన్నారు. ఆరు సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో అనేక గ్రామాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. నియోజకవర్గంలో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ(చిట్టెంనర్సిరెడ్డి) భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన కాల్వలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులను తొలగించామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యక్తలకు ఎపుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలకు ఎపుడు ఏఆపద వచ్చిన అండగా ఉంటానని, అర్ధరాత్రి తలుపు తట్టినా పనులు చేసి పెడుతానని, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్రెడ్డి భరోసా ఇచ్చారు.
అదనపు గది నిర్మాణానికి భూమి పూజ
మండలంలోని ఉప్పరిపల్లి గ్రామంలో పాఠశాల అదనపు గది నిర్మాణానికి శనివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అలాగే ఖానాపూర్ గ్రామానికి చెందిన అంజనేయు లుకు సీఎం రిలీఫ్ఫండ్ కింద రూ.45 వేలు, మక్తల్ పట్టణానికి చెందిన అశోక్కు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, సర్పంచ్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు పరంధాములు మాజీ సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, మైనార్టీ నాయకుడు హుస్సేన్పాషా మీడియా కన్వీనర్ ఈశ్వర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను తిరుగులేని పార్టీగా చేయాలి
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ఊట్కూర్, సెప్టెంబర్ 18: నియోజకవర్గంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ను పటిష్టం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఊట్కూర్ పట్టణ అధ్యక్షుడుగా వెంకటేశ్గౌడ్, ఉపాధ్యక్షుడుగా కల్వాల్ షమీఉల్లా, కార్యదర్శిగా బసిరెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడ ఇగా కుమ్మరి సచిన్, ఎస్సీసెల్ అధ్యక్షుడుగా నర్సింహా, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఆసిఫ్ ఎన్నికయ్యారు. శనివారం టీఆర్ఎస్ గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం తప్పకుండా ఉంటుందన్నారు. కార్యకర్తలంతా సమన్వయంగా ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, వార్డు సభ్యులు నర్సింహారాజ్గౌడ్, నరేష్, తరణ్రెడ్డి, మహేశ్రెడ్డి పాల్గొన్నారు.