జడ్చర్లటౌన్, జూలై 13 : భావితరాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని అమలు చే స్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రతి ఒ క్కరూ మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులోని శివగిరి క్షేత్రం గుట్టపై మంగళవారం విత్తన బంతులు వెదజల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాల బాగు కోసం హరితహారం అమలు చేస్తున్నారన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో హరితహారానికి 10శాతం నిధులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసమే పనిచేశాయని, ప్రజల బాగు కోసం ఏనాడూ ఆలోచించలేదన్నా రు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సుఖసంతోషంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. పల్లెప్రగతితో పారిశుధ్యం మెరుగుపడి రోగాల వ్యాప్తి తగ్గిందన్నారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా గ్రామాల్లోనే పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దో రేపల్లి లక్ష్మీ, సింగిల్విండో అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కొంగలి జంగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, తాసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో స్వరూప, నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.